తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్టుల్లో భాగంగా నిన్న చేయించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరాను అని పోచారం తెలిపారు.
మూడు రోజుల క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరైన తన మనవరాలి పెళ్లిలో స్పీకర్ పాల్గొన్నారు. వివాహానికి హాజరైన వారు, సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన కోరారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరుణంలో మళ్ళీ కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కమల్ హాసన్, ప్రముఖ డాన్సర్ శివకుమార్ మాస్టర్, ఇప్పడు పోచారం…ఏది ఏమైనా అందరూ జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.
సోమారపు పార్టీనీ వీడటం వల్ల నష్టమేమీ లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్