ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పుల వ్యవహారం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్ను అని, క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుందని తెలిపారు.
కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని.. తనకు ఎస్పీ ఇస్తేనే నేను కాల్చాను. తనకు ఎస్పీనే తుపాకీ ఇచ్చారని మంత్రి తెలిపారు
ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా! అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన.
కాగా.. అంతకుముందు మహబూబ్నగర్లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య మంత్రి శ్రీనివాస్ తుపాకీతో కాల్పులు జరిపారు.
పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మరోవైపు పోలీస్ అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
రాహుల్ హీరో..మోడీ జీరో: విజయశాంతి