telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రతి భార‌తీయుడి గుండె అనందంతో ఉప్పొంగే స‌మ‌య‌మిది..

*గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన సీఎం కేసీఆర్..
*దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది..

గోల్కొండ కోట‌పై తెలంగాణ సీఎం జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందని.. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ చేర్చామని.. తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు.

తెంలగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భార‌తీయుడి గుండె అనందంతో ఉప్పొంగే స‌మ‌య‌మిదని చెప్పారు.

వేలాది మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు త‌మ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మ‌హానీయుల త్యాగాల వ‌ల్లే స్వాతంత్ర్య ఫ‌లాలు అనుభ‌విస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది అన్నారు.

దేశానికి దూక్సూచిగా తెలంగాణ నిలుస్తోంది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న, చేసిన అభివృద్ధి పనులు గురించి కేసీఆర్‌ మాట్లాడుతున్నారు..

Related posts