telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పెరుగుతున్న కరోనా కేసుల పై తెలంగాణ హైకోర్టు విచారణ…

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయిన కూడా మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇక కోవిడ్ 19 కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోవిడ్ టెస్టులు, చర్యలపై హైకోర్టు కు రిపోర్ట్ సమర్పించారు ఏజీ బీఎస్ ప్రసాద్.   మార్చ్ 7, 11వ తేదీల్లో  20 వేల లోపు టెస్టులు మాత్రమే చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  అయితే… సొంతంగా సేరో సర్వేలెన్సు సర్వే చేయడానికి సమయం కావాలని కోరారు ఏజీ ప్రసాద్. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నారని…రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్‌ స్టేషన్ లో 300 మొబైల్ బస్సులతో టెస్టులు నిర్వహిస్తున్నామని ఏజీ పేర్కొన్నారు.  కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ గుంపులు, గుంపులుగా ఉండటంపై ఆంక్షలు విధించాలని.. అంత్యక్రియలు, పెళ్ళిల్లో 100 మందికి మించరాదని  హైకోర్టు ఆదేశించింది. చూస్తుంటే మళ్ళీ మొత్తం లాక్ డౌన్ వైపుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది.

Related posts