telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మైన కాసేపట్లోనే వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం సంతాపం తెలిపింది.తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ శాసన సభ్యులు పరిపాటి జనార్దన్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది.

మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు శాసనసభ సభ్యులు మౌనం పాటించారు.ఈనెల 3న నిర్వహించే కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించారు.

అనంతరం  ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

Related posts