తెలంగాణ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. పెరిగిన నిత్యవసరాల ధరలు, గ్యాస్-పెట్రోల్-డీజిల్ ధరల పై పార్లమెంట్ లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారు అని విమర్శించిన ఆయన.. మీ ఎంపీలు పార్లమెంటుకు ఎందుకు రావడం లేదు..? ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయపడుతున్నారా..? లేక రాజీ పడుతున్నారా..? అంటూ నిలదీశారు.. బీజేపీపై గల్లీలో మీ మాటలకు, ఢిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదని లేఖలో ఆరోపించిన రేవంత్ రెడ్డి… విశాఖ ఉక్కు పోరాటానికి మీ మద్దతు వెనుక దురుద్దేశం ఉందని కామెంట్ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేశారని.. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై మీరు పోరాడరు.. కానీ, విశాఖ ఉక్కు కోసం పోరాడతారా?.. మీ మోసం సరిహద్దులు దాటుతోంది అంటూ ధ్వజమెత్తారు. మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడరు… మీరు జంతర్ మంతర్ వద్ద దీక్షకు రారు.. కానీ, ఎన్నికలప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం… ఎన్నికలయ్యాక వాటిని మర్చిపోవడం మీకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. చూడాలి మరి దీని పై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది.
previous post
జగన్ కోసం కుట్రలకు..ఏపీలో కేసీఆర్ ప్లాన్: దేవినేని