ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల పట్ల పోలీస్ చర్యలను టీడీపీ నేత, ఎమ్మెల్సీ లోకేశ్ ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులతో కవాతు చేయించి ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదన్నారు. టెంటు పీకేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదన్నారు.
సీఎం జగన్ నిరంకుశత్వ పాలనకి రాజధానిలో ఉన్న పరిస్థితులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుందని.. రైతులను నడి రోడ్డుపై ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టడానికి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారని పేర్కొన్నారు.