నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 12 గంటల నిరాహారదీక్షకు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. మూసి వేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు వెంటనే రక్షణ కిట్లను అందించాలని కోరారు.

