telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు వార్తలు

చిత్తూరు : అమ్మ ఒడి నిర్వాహకం తీరుపై కలెక్టర్ సీరియస్…

చిత్తూరు జిల్లా సంత పేటలోని అమ్మఒడి సేవా సంస్థ అవినీతిపై ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించారు కలెక్టర్. అమ్మ ఒడి నిర్వాహకం తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. RDO, DSP, ICDS P.D లను విచారణ అధికారులుగా నియామకం చేశారు. ఆ తర్వాత అధికారుల కమిటీ క్షుణ్ణంగా ఆశ్రమాన్ని తనిఖీ చేసింది. ఆశ్రమంలో పిల్లలను ఉంచడానికి నిర్వాహకుడికి ఎలాంటి అనుమతి లేదని కమిటీ గుర్తించింది. అనాధ పిల్లల్ని చూపించి దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి సొంతంగా వాడుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. శిధిలావస్థలో ఉన్న భవనంలో పిల్లల్ని ,వృద్ధులను ఎలా ఉంచుతారని అధికారులు ప్రశ్నించారు. భవనంలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఫైర్ అయ్యారు అధికారులు. నిర్వాహకుడి పై క్రిమినల్ కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసు యంత్రాంగం సిద్ధమవుతుంది.

Related posts