telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్, కేటీఆర్ పొలిటికల్ టెర్రరిస్టులు: భట్టి విక్రమార్క

CLP Batti vikramarka fire KCR KTR

తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా భట్టి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ పొలిటికల్ టెర్రరిస్టులని, ఇలాంటివాళ్లను అడ్డుకునే అవసరం ఉందన్నారు. కేసీఆర్ వెన్నులో భయం మొదలైందని, అందుకే రాష్ట్రంలో సీఎల్పీ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ లాంటి ప్రజాస్వామ్య ద్రోహులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కేటీఆర్‌కు దేశ చరిత్ర, చట్టాలపై అవగాహన లేదని భట్టి విక్రమార్క అన్నారు. అయారాం, గయారాం లాంటివాళ్లు పెచ్చుమీరతారనే ఆనాటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికల బరిలో నిలవాలని భట్టి డిమాండ్ చేశారు.

Related posts