telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు: చంద్రబాబు

chandrababu

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో మార్టూరులో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.ఒక్క చాన్స్ అంటే ఓటేశారని, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. తొమ్మిది నెలల వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మద్దతు ధరల్లేవు, పేదలకు కడుపు నిండా తిండిపెట్టే అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ప్రజల కోసం పోరాడితే ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే వీళ్లు పాదయాత్రలు చేసేవాళ్లా? అని ప్రశ్నించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకీ కళ్లెం వేయాలని పేర్కొన్నారు.

Related posts