telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబును అడ్డుకున్నసెక్యూరిటీ.. అసెంబ్లీ ముందు టీడీపీ నిరసన

chandrababu fire on AP CS again

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో పాల్గొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లోనికి వెళ్తుండగా  అసెంబ్లీ సెక్యూరిటీ అడ్డుకుంది. ప్లకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు. సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన… మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాజకీయాలు నీచంగా ఉన్నాయని అన్నారు. తాము పేపర్లు తీసుకొస్తున్నా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts