telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది: తమ్మినేని

ap speaker tammineni

శాసనమండలిలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండల్రిలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తమ్మినేని మాట్లాడుతూ ద్రవ్య వినియమ బిల్లును కూడా అడ్డుకున్నారని విమర్శించారు.

సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం విపక్షానికి ఇష్టం లేదా? అని మండిపడ్డారు. శాసనసభ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో ఏర్పడుతుందని అన్నారు. అంతిమ నిర్ణయాలు అక్కడే జరుగుతాయని స్పష్టం చేశారు. మండలిలో జరిగే నిర్ణయాలను పట్టించుకోనవసరంలేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇది వర్తిస్తుందని తెలిపారు.

Related posts