పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. డేరాఇస్మాయిల్ఖాన్ జిల్లాలో బాంబు ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఆస్పత్రి బయట ప్రజలు రద్దీగా ఉన్న ప్రమాదంలో బాంబులు పేలడంతో ఆరుగురు పోలీసులతో సహా 9 మంది మృతి చెందారు. ఉగ్రదాడిలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాంబులు పేలడంతో ఆసుపత్రి ప్రాంతం దద్దరిల్లింది. దాడులు తమ పనేనని తెహ్రక్ – తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఒప్పుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. మరో వైపు దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో తనిఖీలు ముమ్మరం చేశారు.