telugu navyamedia
Uncategorized

మహిళ తహసీల్దార్‌పై నిప్పంటించిన ఆగంతకుడు

vijaya tahasildar

రంగారెడ్డి జిల్లాలో దారుణం సంభవించింది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఆమె పై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

భోజన విరామ సమయంలో జనం తక్కువ ఉన్నప్పుడు దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాసేపటి క్రితం ఘటనా స్థలికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. మరోవైపు విజయ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Related posts