telugu navyamedia
Uncategorized

పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్‌ చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్న ప్రకటన మరింత క్రేజీగా మారింది. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సినిమా పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాలతో ముందుకు సాగుతోంది. మొదట పవన్ రాజకీయ సమస్యలు, తరువాత మెగా డాటర్ వివాహం తదితర వాయిదాల తరువాత ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. అయితే మెగా డాటర్ నిహారికా వివాహానికి వెళ్లేందుకు పవన్ ఈ సినిమా నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నాడు. పెళ్లి పూర్తయిన తరువాత మళ్లీ చిత్రీకరణలో పాలుపంచుకున్నారు. మొదటగా వచ్చే ఏడాది సంక్రాంతిపోరులో వకీల్ సాబ్ తలపడనున్నాడని అన్నారు. అయితే దాని నుంచి తప్పుకొని వేసవిలో విడుదలకు సిద్దం అవుతోంది. అయితే పవన్ ఈ సినిమా అనంతరం మరో రీమేక్‌లో చేయనున్నాడు. ఈ సినిమా ప్రకటన బయటకు వచ్చింది. మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

Related posts