telugu navyamedia
Uncategorized

|ప్రధానిని ట్యాగ్ చేస్తూ జబర్దస్త్ కామెంట్స్ చేసిన రష్మీ

rashmi

కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించారు ప్రధాని నరేంద్ర మోదీ.లాక్‌డౌన్ కారణంగా చిన్నాపెద్దా అంతా ఇంట్లోనే ఉంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఖాళీ సమయంలో కొందరు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ వీడియోలు చేస్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఆదేశాలు, చేస్తున్న సేవ గురించి వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చిన్నారి, మోదీ హోమ్ క్వారంటైన్ గురించి ముద్దుముద్దుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన రష్మీ.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. మోదీ అంకుల్‌ ఇది చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ”అవును బాబు.. మనం ఇంట్లోంచి బయటకు వెళ్ల కూడదు. లాక్‌డౌన్‌ ఉందని మోదీ అంకుల్‌ ఇచ్చిన ఆదేశాలను చాలా క్యూట్‌గా చెప్పావు” అని కామెంట్ చేసింది.

Related posts