2018లో విడుదలైన `అజ్ఞాతవాసి` తర్వాత పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విజయవంతమైన `పింక్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దిల్రాజు, బోనీకపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే లోపు పక్కా ప్రణాళికతో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. సోషల్ మీడియా వార్తల ప్రకారం ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతారను నటింప చేయాలని అనుకుంటున్నారట. పాత్ర నిడివి తక్కువగానే ఉండటంతో పాటు పవన్, నయన జోడి ఫ్రెష్ లుక్ తెస్తుందని భావిస్తున్నారట. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
previous post