ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు బేజీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజధాని అమరావతి ప్రకటనకు ముందే చందర్లపాడులో తమకు భూములున్నాయని సుజనా స్పష్టం చేశారు. రాజధాని పరిధిలో తనకు భూములున్నాయని నిరూపించాలని తాను చేసిన సవాల్ ను మంత్రి బొత్స నిరూపించలేకపోయారని ఆయన చెప్పారు.
గుంటూరు జిల్లాలోని రాజధాని గురించి ప్రశ్నిస్తే కృష్ణా జిల్లాలోని భూముల గురించి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. తమ భూములు కృష్ణా జిల్లాలోని చందర్లపాడులో ఉన్నాయని సుజనా చౌదరి తెలిపారు. చందర్లపాడులో భూములు దశాబ్దాల క్రితమే తమకు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. రాజధాని పరిధి 29 గ్రామాల్లో ఉన్న విషయం మంత్రికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అంశాన్ని పక్కదోవపట్టించేందుకే మంత్రి తన భూముల అంశాన్ని తెరమీదికి తెచ్చారని సుజనా ఆరోపించారు.
చంద్రబాబు రాజధానికి ఓ అడ్రస్ లేకుండా చేశారు: మంత్రి బొత్స