telugu navyamedia
Uncategorized

గురుదేవో భవ: టీచర్స్ డే

గురువును దేవుడితో సమానంగా చూస్తూ.. గురువుల‌ను గౌరవించడం మ‌న‌ భారతీయ సంప్రదాయం. భారతీయ సంప్రదాయం. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది.

గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని భారతీయుల విశ్వాసం. తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు… అందువల్ల “మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే.. అలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవించడం, సత్కరించడమే.

బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది.ఏ రంగంలో అయినా, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎవరైనా సరే ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వారే. గురువులు అందించిన విజ్ఞానంతో, సంస్కార సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే. పిల్లల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర . ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వర్తించే గురువు కలకాలం తలెత్తుకు జీవించవచ్చు. ఇంత గొప్ప గొప్ప అవకాశం మరెవ్వరికీ దక్కదని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది, ఉపాధ్యాయులు అంతటి గొప్ప వారు. కాబట్టి టీచర్స్ డే విద్యార్థులకు ఒక పండుగ రోజు. గురువులకు గురుతరమైన బాధ్యతను గుర్తు చేసే రోజు. గొప్ప గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు .

మ‌న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం (Teachers’ Day) సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు’. ఈ రోజు సెలవుదినం కాదు. .ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ జ‌న‌నం
సర్వేపల్లి రాధాకృష్ణన్ 5- 1888న మద్రాసులో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు అయినా సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము, విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు క‌లిగివారు.

వివాహం, సంతానం
1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.

ఉద్యోగం
21 సంవత్సరాలైనా దాటని వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్ గా నియమించారంట‌. అతను ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో అతను కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను ‘భారతీయ తత్వశాస్త్రం’ అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.

1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.

1931లోనే రాధాకృష్ణన్ “లీగ్ ఆఫ్ నేషన్స్ ‘ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'” సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి ‘స్వాతంత్ర్యోదయం’ సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.

డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.

Related posts