సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న “సైరా” చిత్రంలో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ చిత్రంగా సైరా రూపొందగా, ఈ ప్రాజెక్ట్ కోసం 280 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని ఇన్సైడ్ టాక్. చిరంజీవి రెమ్యునరేషన్ కాకుండా అంత మొత్తం ఖర్చు చేసారని చెబుతుండగా, సినిమా లాభాలలో మెగాస్టార్ వాటా పుచ్చుకుంటాడని అంటున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగగా, కొణిదెల ప్రొడక్షన్ బేనర్పై రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో చిరు డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్లో చిరు చెప్పిన డైలాగులు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా ఉన్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post