ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా నటించనున్నాడు. గణేష్ హీరోగా, వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
“తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్స్టాప్గా సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం” అని దర్శక , నిర్మాతలు అన్నారు.
మరోవైపు ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
పార్థిపన్ హీరోగా నేషనల్ అవార్డు సాధించిన "ఓర్త సెరుపు సైజ్ 7" అనే తమిళ్ చిత్రానికి రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది……… pic.twitter.com/7zG5UWD4b2
— BANDLA GANESH. (@ganeshbandla) September 4, 2021
రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు