telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ నేతల ఆడియో టేపులు రిలీజ్ చేసిన తృణమూల్…

నందిగ్రామ్ లో సహకరించాలని మమతా బెనర్జీ ఫోన్ చేశారని బీజేపీ ఫోన్ కాల్ ఆడియో విడుదల చేసిన క్రమంలో ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారికి బీజేపీ  ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన రెండు గంటల్లో కౌంటర్ ఆడియో టేపును దీదీ శిబిరం విడుదల చేసింది. బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్, సిసిర్ బజోరియాల ఫోన్ కాల్ ఆడియో లీక్ అయింది. ఎన్నికల సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేయవచ్చో శిశిర్ బజోరియాకు ముకుల్ రాయ్ ఫోన్లో వివరిస్తున్నాడని త్రిణమూల్ ఆరోపించింది. సరిగ్గా ఫోన్ లో వివరించిన విధంగా ఈసీ స్పందించింది అని టీఎంసీ ప్రతి దాడికి దిగింది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను అన్ని పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతుంటే.. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అంటూ.. బెంగాల్ సీఎం పీఠంపై కన్నేసింది భారతీయ జనతా పార్టీ.. మరోవైపు.. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలు ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు.. ఎవరిని గెలిపిస్తారు అనేది.

Related posts