telugu navyamedia
సినిమా వార్తలు

ఎక్కడో మూలన కూర్చొని ఏడ్చేవాడిని… సుధీర్ బాబు

Sandeep-Kishan-and-frds

హీరో సందీప్ కిషన్ నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘నిను వీడను నీడను నేనే’. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించగా దయా పన్నెం, సందీప్ కిషన్, వీజీ సుబ్రహ్మణ్యన్ నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక సందీప్ కిషన్ సరసన హీరోయిన్ అన్యాసింగ్ నటించారు. ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్‌తో పాటు సుధీర్ బాబు, నిఖిల్, కార్మికేయతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ “సందీప్‌కు వరుసగా రెండు సినిమాలు నిరాశపర్చినా వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు. అదే తనైతే ఎక్కడో మూలన కూర్చొని ఏడ్చేవాడినని చెప్పారు. ఇక నుంచి సందీప్‌ను స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ నిందను హీరోపేనే నెట్టేస్తారని.. కానీ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా సందీప్ దొరికాడని చెప్పి సుధీర్ నవ్వులు పూయించారు. ఒక నిర్మాతగా తనకు కూడా ఓ ప్రొడ్యూసర్ దొరికాడు” అని తెలిపారు.

Related posts