telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్  మర్యాద పూర్వకంగా కలిశారు.

డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు.

రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  కుటుంబం తరఫున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమావేశానికి మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరైనారు.

Related posts