తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. అనసూయ యాంకర్ గా పాపులారటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ గ్లామరస్ యాంకర్గా రాణిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “కథనం” సినిమా విడుదలయింది. ఈ భామ తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. “నా గుండె బద్దలైంది… బాధ తట్టుకోలేకపోతున్నాను అంటూ అనసూయ ఆ పోస్ట్ లో పేర్కొంది. ఇటీవల అమెజాన్ రెయిన్ ఫారెస్టులో అడవుల్లో నిప్పు అంటుకొని కొన్ని వేల హెక్టార్లలో అడవులు కాలి బూడిద అయ్యాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణ వాయువును అందించడంలో అమెజాన్ ఫారెస్ట్ కీలక భూమిక వహిస్తున్నాయి. యావత్ ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువులో 20 శాతం పైగా అమెజాన్ అటవీ ప్రాంతం నుంచి విడుదల అవుతుందనిఅవుతోంది. మనిషి అనే రాక్షసుడి దురాశతో ఇలాంటి దుస్థితి వచ్చింది” అని అనసూయ పోస్ట్ లో పేర్కొంది.
next post