నిన్న తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. కానీ, ఫెయిలైన ఓ విద్యార్థిని మాత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
అనామిక, కోఠిలోని ప్రగతి మహావిద్యాలయంలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో తన పేరు కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.