telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సినిమా ఆగిపోయిందట… హీరోనే క్లారిటీ ఇచ్చాడు

Bellamkonda

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యంగ్ హీరో జయ జానకీ నాయక, సాక్ష్యం సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇటీవల “రాక్షసుడు” సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ త్వరలో మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కందిరీగ ఫేం సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌తో రెడీ అయ్యాడు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయి శ్రీనివాస్‌ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముందుగా ఈ కాంబినేషన్‌లో తమిళ సూపర్‌ హిట్ తెరీ సినిమాను రీమేక్‌ చేయాలని భావించారు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాకపోవటంతో కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు. విజయ్‌ హీరోగా తమిళ్‌లో ఘనవిజయం సాధించిన తెరీ సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ముందుగా పవన్‌ తెరీ రీమేక్‌కు ఓకే చెప్పిన తరువాత ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. తరువాత రవితేజ హీరోగా బెల్లంకొండ సురేష్‌ బ్యానర్‌లో ఆ సినిమా ప్రారంభమైన అనివార్య కారణాలతో ఆగిపోయింది. తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కంటిన్యూ చేయాలని భావించినా తరువాత తెరీ రీమేక్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.ప్రస్తుతం కామెడీ యాక్షన్‌ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

Related posts