telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితో యాంకరింగ్ పై శ్రీముఖి సంచలన నిర్ణయం…!

Srimukhi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్ అయిన తర్వాత వెంటనే ఫ్యామిలీ ట్రిప్ కోసం మాల్దీవ్స్ వెళ్లొచ్చింది శ్రీముఖి. ఇప్పుడు శ్రీముఖి మళ్లీ బుల్లితెర ముందుకు రాబోతోంది. బిగ్ బాస్ తరువాత ఈ బ్యూటీ చాల జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. స్టార్ మాలో మ్యూజిక్ లీలోడెడ్ అంటూ శ్రీముఖి కొత్త అవతారం ఎత్తబోతోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేయగా… అదికాస్తా వైరల్ అయింది. అయితే ఎక్కడికి వెళ్లినా కూడా ఆమెను ఒక్కటే ప్రశ్న మళ్ళీ మళ్లీ అడుగుతున్నారు. అదే పటాస్ షో రీ ఎంట్రీ ఎప్పుడు అని… ఒకప్పుడు బిగ్ బాస్ షో కోసమే పటాస్ నుంచి శ్రీముఖి వెళ్లిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత రవితో గొడవలే దీనికి కారణమనే ప్రచారం జరిగింది. దానికితోడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు తనను ఒకరు మోసం చేసారని.. పెళ్లి వరకు వచ్చిన తర్వాత అతడి గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని చెప్పింది శ్రీముఖి. దాంతో రవితో రిలేషన్ గురించే ఇన్ డైరెక్టుగా శ్రీముఖి చెప్పిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. కాగా ఇప్పుడు పటాస్ రీఎంట్రీ గురించి శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు పటాస్ షో చేయాలని ఉందా లేదా అనేది పక్కనబెడితే దీనిపై నిర్ణయం తీసుకోడానికి కూడా తనకు ఇంకాస్త టైమ్ కావాలని తెగేసి చెప్పేసింది. దానికితోడు పటాస్ షో చేయడానికి తనకు తన తండ్రి పర్మిషన్ కావాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈమె షోలు ఈమెకు ఇష్టమైతే చాలు కానీ తండ్రి వరకు ఎందుకు అనే చర్చ కూడా వస్తుంది. దీంతో ఖచ్చితంగా రవి, శ్రీముఖికి మధ్య ఏవో విభేదాలు నడుస్తున్నాయని అనుకుంటున్నారు. మరి అసలు కథ ఏంటో తెలియాల్సి ఉంది.

Related posts