telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కరోనాకు విరుగుడంటూ.. కట్లపామును కసాబిసా కొరికి…చివరికి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది. అటు కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను అన్నీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇంతలోనే.. నెల్లూరు ఆయుర్వేద మందు అని పెద్ద వివాదమే కొనసాగుతోంది. ఇంకా మిగతా చోట్ల కూడా కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును కొరికి నమీలేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. మధురై జిల్లా పేరుమపత్తికి చెందిన వడివేలు వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల బాగా మద్యం తాగి చనిపోయిన కట్లపామును ఒకదానిని మెడలో వేసుకొని డాన్స్ లేశాడు. పామును తింటే కరోనా రాదని చెబుతూ దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో జిల్లా ఫారెస్ట్ అధికారులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు స్పందించి వడివేలును అరెస్ట్ చేశారు. అంతేకాదు అతడికి రూ. 7 వేల ఫైన్ కూడా విధించారు పోలీసులు.

Related posts