సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ దేశాన్నే కలచివేసింది. ఆయన కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ఆయన అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణంతో అభిమానులంతా విషాదంలో మునిగినిపోయారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. బాలుతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలోనే బాలు తన స్వహస్తాలతో రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ… “కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు ‘డాక్టర్’, ‘పద్మభూషణ్, ‘గానగంధర్వ’ వంటి విశేషణలు వేయకండి” అని కోరారు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.