బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతుంది.ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన వార్తల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.
మేరకు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ ను పంచుకుంది..నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలు, జర్నలిస్టులు, వార్తా విలేకరులను నేను అభ్యర్థిస్తున్నాను” అంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
అ వ్యక్తి నా పేరును వాడుకుని పబ్లిసిటీ కోరుకుంటున్నాడు. నా ప్రతిష్టను దిగజార్చేందుకు నా నుంచి డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నాడు. కష్టపడి నాకంటూ ఓ మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాను… కాబట్టి ఇలాంటివి నమ్మవద్దు. నా లీగల్ టీమ్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటుంది” అని తెలిపింది. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది.
కాలం అనుకూలిస్తే ఆ పని కూడా చేస్తా… : ప్రియాంక చోప్రా