స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తమన్ స్వరకర్త. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ యొక్క పూర్తి లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ‘‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట (లిరికల్ వీడియో) అద్భుతంగా ఉంది. ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. కాగా ఈ సినిమా టైటిల్లో న్యూమరాలజీ ప్రకారం ఒక కరెక్షన్ చేశారు. ఇదివరకు ‘అల వైకుంఠపురం’ టైటిల్ను ఇంగ్లీష్లో ‘Ala Vaikuntapuramloo’ అని ప్రమోట్ చేయగా.. ఇప్పుడు మరో ఆర్ చేర్చి.. ‘Ala Vaikuntapurramloo’ అని టైటిల్ను ప్రమోట్ చేస్తున్నారు. న్యూమరాలజీ సెంటిమెంట్ మేరకే ఈ కరెక్షన్ చేసినట్టు తెలుస్తోంది.
previous post
next post
రజినీకాంత్, కమల్ హాసన్ లపై కట్టప్ప వ్యాఖ్యలు