telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

స్వల్ప లాభాల బాటలో.. స్టాక్ మార్కెట్లు..

husge loses again in stock markets

నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్ లు స్వల్ప లాభాలలో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.55 సమయంలో సెన్సెక్స్‌ 290 పాయింట్ల లాభంతో 35,643, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 10,675 వద్ద ట్రేడవుతోంది. వేదాంత షేర్లు దాదాపు 2శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు బలపడి రూ.71.29 వద్ద ట్రేడవుతోంది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం కూడా దీనికి కారణం. మరోవైపు డబ్ల్యూటీఐ క్రూడ్‌ఫ్యూచర్‌ ధరలు 25 సెంట్లు పతనమై 55.84 డాలర్ల వద్ద ట్రేడువుతోంది.

ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడువుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, హీరోమోటో కార్ప్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి .

Related posts