పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన డైరెక్టర్ క్రిష్తో తెరకెక్కే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ జోనర్లో తెరకెక్కబోయే ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బందిపోటు, గజదొంగ, ఓం శివమ్.. ఇలాంటి టైటిల్స్ పరిశీలనలోఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్ కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతర్వాహిని టైటిల్ విషయం నెట్టింట హల్ చల్ చేస్తుండగానే క్రిష్ తన ఇన్స్టాలో రైటర్ సాయిమాధవ్ బుర్రా రాసిన అంతర్వాహిని అనే కవితను పోస్ట్ చేశారు. అయితే క్రిష్ ఇప్పుడు ఈ కవితను పోస్ట్ చెయ్యడం వెనుక రీజన్ ఏంటనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
previous post