యంగ్ హీరో శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన “రణరంగం” సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. శర్వానంద్ కెరీర్లో రికార్డు ఓపెనింగ్స్ అందించిన సినిమాగా “రణరంగం” నిలిచింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో థియేటర్లలో రన్ అవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ “నా కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది. ఈ విషయంలో ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. రివ్యూలను గౌరవిస్తాను. సినిమాలో కథ లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. సందేశం ఇవ్వడం కోసం మేం ఈ సినిమా చేయలేదు. ఓ స్టైలిష్ యాక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందిద్దామనుకున్నాం. ఆ విషయంలో మేం పూర్తిగా విజయం సాధించాము” అని శర్వానంద్ అన్నాడు.
అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు