telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో ఎఫైర్… అందుకే సినిమాలకు దూరం : సమీరా రెడ్డి

Sameera-Reddy

టాలీవుడ్ లో నరసింహుడు, అశోక్, జై చిరంజీవ, చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి… రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది. ఇక ఎన్టీఆర్ తో కలిసి సమీరా రెడ్డి అశోక్, నరసింహుడు చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, సమీరారెడ్డి గురించి మీడియాలో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. హీరో హీరోయిన్ల ప్రేమ గురించి రూమర్లు వినిపిస్తే మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుంది. అలాంటి రూమర్లే నటీనటుల కెరీర్ పై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది సమీరా రెడ్డి. ఎన్టీఆర్ తో తాను ప్రేమలో ఉన్నానంటూ అప్పట్లో వచ్చిన ఊహాగానాలు తన కెరీర్ పై ప్రభావం చూపాయని సమీరా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని సమీరా అంటోంది. ఎన్టీఆర్ స్నేహితుడు కాబట్టే సన్నిహితంగా ఉన్నాను. అంతకు మించి మా మధ్య ఇంకేమి లేదు. జనం మా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకోవడం, మీడియాలో వార్తలు రావడంతో మా ఇంట్లో వాళ్లకు తెలిసింది. పెద్ద సమస్యగా మారుతుండడంతో టాలీవుడ్ సినిమాలకు తానే దూరమైనట్లు సమీరా రెడ్డి పేర్కొంది. సమీరారెడ్డి హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే అక్షయ్ వార్థే అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని స్థిరపడింది. ప్రస్తుతం సమీరారెడ్డి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సమీరారెడ్డి గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Related posts