ఏపీ సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాంతాల మధ్య జగన్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ నిర్ణయం ఒక వ్యక్తిపై ప్రతీకార చర్యగా ఉందని చెప్పారు. అమరావతిని నాలుగేళ్ల క్రితమే జగన్ సమర్థించారని గుర్తు చేశారు.
రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో పాలన లేదని… అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఎవరైనా ఒప్పుకుంటారని… కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.


ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్ అవగాహనా రాహిత్యం: అనురాధ