telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు దుర్మరణం

Accident

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మామిడిపండ్ల లోడుతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న లారీలో కొందరు వలస కూలీలు ఎక్కారు.

మార్గమధ్యలో నర్సింగ్‌పూర్ జిల్లా పరా వద్ద లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts