telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానాయకునికి వినమ్ర నివాళులు అర్పించారు.

ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూరదృష్టి కలిగిన నేత పీవీ గారని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లి, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు.

బహు భాషావేత్తగా, పండితుడిగా, రచయితగా వారు అనేక రంగాల్లో భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచారని అన్నారు.

పీవీ నరసింహా రావు దూరదృష్టి, సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, వారి ఆలోచనలు, ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Related posts