telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ బౌద్ధారామాన్ని కాపాడుకోవాలి: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

విశాఖ తొట్లకొండ ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాన్ని కాపాడుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బౌద్ధారామం ప్రాంతంలో ఇతర నిర్మాణాలు చేపడితే అక్కడి చారిత్రక ప్రాశస్త్యం అంతరించిపోతుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న బౌద్ధారామం వంటి ఆకృతులే ఇండోనేషియాలోని గోడో బుదూర్ అనే ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. వాటికి అక్కడ ఎంతో ప్రాధాన్యత లభిస్తోందని ఆయన చెప్పారు.

తొట్లకొండ ప్రాంతం కేంద్ర ఆర్కియాలజీ విభాగం పరిధి గురించి సంబంధిత కేంద్రమంత్రిని అడిగానని తెలిపారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు నిర్మాణాలు జరగబోతున్న స్థలం రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలో ఉందని వెల్లడైందని రఘురామకృష్ణరాజు వివరించారు. ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కంచే చేను మేసినట్టు అవుతుందని అన్నారు. ఒకవేళ నిర్మాణాలు జరిగితే ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలోనికి తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారని తెలిపారు.

Related posts