హైదరాబాద్ హుస్సేన్సాగర్ అందాలను వీక్షించేందుకు నగరవాసులే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు వస్తుంటారు. అయితే ప్రజల సౌకర్యార్థం ట్యాంక్బండ్పై ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపట్టంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటలకు ట్యాంక్బండ్పై ట్రాఫిక్ను అనుమతించకుండా కేవలం నగరవాసులు మాత్రమే సరదా గడిపేలా చేసారు.
అంతేకాకుండా మరిన్ని అదనపు ఆకర్షణలు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించగా హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆటాపాటలతో పాటు సంతోషంగా గడిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అలాగే ట్యాంక్బండ్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం, టి.ఎస్.ఆర్టీసీ ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్యాంక్బండ్పై సందర్శకులను మాత్రమే అనుమతిస్తుండడంతో, సాయంత్రం 4.00 నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్, కోఠి, కాచిగూడ స్టేషన్, మెహిదీపట్నం, హకీంపేట, చార్మినార్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.