telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు- ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ..అనేక మంది అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

Image

భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని, ఆ వినాయకుని దయవల్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా జరగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

Image

ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటోల కార్తీక్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ శాఖను స్థాపించి మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికై, పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తున్న కాసర్ల నాగేందర్ రెడ్డిని మూడో సారి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ ఎన్ ఆర్ ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నియమించారు. ఎమ్మెల్సీ కవిత, కాసర్ల సురేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు…

Related posts