కుమురం భీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోయాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. దీంతో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. మృతులను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన సతీష్, రాముగా గుర్తించారు.
వివారాల్లోకి వెళితే..
కుమురం భీం జిల్లా దహేగాం మంండలంలోని పెసరకుంట వాగు ప్రవహిస్తుండటంతో సహాయ చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ టీమ్ను పంపించింది. అక్కడ ఇద్దరు కార్మికులు ఓ గర్భిణీని వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నిన్న గల్లంతయ్యారు.
రెస్క్యూ టీంలోని సతీష్, రాములు ఇద్దరూ ఒక గర్భిణిని వాగు దాటించే క్రమంలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలకు ఈ రోజు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులిద్దరూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను: రాజా సింగ్