కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్నివేళలా అండగా ఉంటూ సీఎం కేసీఆర్ ప్రతి పేదింటికి పెద్దన్నయ్యలా మారారని కొనియాడారు.
గర్భంలో శిశువుల నుంచి, మనుషుల మరణానంతరం వరకు అనేక ప్రభుత్వ సేవలు ఉచితంగా అందిస్తున్నారని, ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సీఎం కేసీఆర్ లక్ష్యం కూడా అదేనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపైనా విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం వ్యవసాయాన్ని పండుగ చేయాలని సీఎ తపించిపోతుంటే, కేంద్రం మాత్రం వ్యవసాయాన్ని దండగ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారు: రేవంత్