మాస్ మహారాజా రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీని కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం రవితేజ.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోంది ‘క్రాక్’మూవీ. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే.. తాజాగా రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పాడట. ఒక్క పాట మినహా క్రాక్ షూటింగ్ మొత్తం పూర్తి కాగా.. ఇటీవల డైరెక్టర్ మారుతి రవితేజకు ఓ కథను వినిపించాడట. అయితే.. ఆ కథ రవితేజకు నచ్చిందట. మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ తో ఉన్న కథ కావడంతో రవితేజ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
next post