telugu navyamedia
సినిమా వార్తలు

రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ?

Rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.  వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. కాగా.. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని స‌మాచారం. తెలుగులో విజ‌య‌వంత‌మైన `జెర్సీ` చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌నున్నారు. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించ‌నున్నార‌ట‌. ఇందులో హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను న‌టింప చేయాల‌ని నిర్మాత క‌ర‌ణ్ జోహార్ అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related posts