“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. కాగా.. ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. తెలుగులో విజయవంతమైన `జెర్సీ` చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట. ఇందులో హీరోయిన్గా రష్మికను నటింప చేయాలని నిర్మాత కరణ్ జోహార్ అనుకుంటున్నారట. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
previous post
సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా