సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా “డియర్ కామ్రేడ్”. “యు ఫైట్ ఫర్ వాట్ యు లవ్” ట్యాగ్ లైన్. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. సామాజిక బాధ్యత ఉన్న ఇన్టెన్సివ్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పించనున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్” ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ శుక్రవారమే గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించింది రష్మిక. “డియర్ కామ్రేడ్” సినిమాలో హీరోయిన్ రష్మికా మందన్న క్రికెటర్గా నటించింది. రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా కనిపించబోతోంది. ఇందుకోసం దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసింది. తన జీవితంలో ఎప్పుడూ క్రికెట్ వైపు చూడలేదని, తొలిసారి ఈ సినిమా కోసమే బ్యాట్ పట్టుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చెప్పింది. “నా జీవితంలో ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. బాస్కెట్ బాల్ మాత్రమే ఆడేదాన్ని. అలాంటిది ఈ సినిమా కోసం కొన్ని రోజులు క్రికెట్ సాధన చేశాను. క్రికెట్కు సంబంధించిన పదజాలం గురించి తెలుసుకున్నాను. ఈ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లు కూడా చూశాను. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. కీలక సమయంలో ధోనీ రనౌట్ కావడం చాలా బాధ కలిగించింది. గుండె ఆగినంత పనైంది” అని రష్మిక చెప్పింది.
previous post