*విజయవాడ జీజీహెచ్ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్..
*ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన శ్రీకాంత్
*మూడు రోజుల క్రితం యువతిపై మిస్సింగ్ కేసు..
*ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
ఏపీలోని విజయవాడ దారుణం చోటుచేసుకుంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో బుధవారం నాడు రాత్రి యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివర్లాలోకి వెళితే
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలికపై ఔట్ సోర్స్ ఉద్యోగి శ్రీకాంత్ దాష్టీకానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు శ్రీకాంత్.. ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
యువతిని గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను నున్న గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేశామని పోలీసులు వెల్లడించారు.
బాధితురాలిని ఇంటి నుండి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు .