ఆంద్ర్రప్రదేశ్ విశాఖలో నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. పెట్రోలింగ్ను ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఎండాడ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన ఎండాడ జంక్షన్ వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం కానిస్టేబుల్ సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానిస్టేబుల్ ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఆదినారాయణ రావు, దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్ సీఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఘటన సమీప ప్రాంతాల్లో సీసీటీవి ఫుటేజ్లను పరిశీలించారు.