telugu navyamedia
క్రైమ్ వార్తలు

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

ఆంద్ర్ర‌ప్ర‌దేశ్ విశాఖలో నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. పెట్రోలింగ్‌ను ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఎండాడ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న ఎండాడ జంక్ష‌న్ వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం కానిస్టేబుల్ సంతోష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానిస్టేబుల్ ‎ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఆదినారాయణ రావు, దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్ సీఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‎కు తరలించారు. ఘటన సమీప ప్రాంతాల్లో సీసీటీవి ఫుటేజ్‌లను పరిశీలించారు. 

Related posts